బాహుబలి సినిమా తర్వాత యంగ్‌ రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, శ్ర‌ద్ధా క‌పూర్ కథానాయకగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'సాహూ'. రెండేళ్లుగా సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఈరోజు పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా సాయింత్రమే ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులకు వెల్లడించింది. 


సినిమా చిత్రీకరణ పూర్తయినందుకు పార్టీ చేసుకున్నట్టు ఫోటోలు కూడా విడుదల చేసింది. దీంతో ఈ సినిమా చిత్రయూనిట్ ప్రకటించినట్టుగానే ఆగష్టు 15 న విడుదల అవుతుంది అనుకున్నారు అభిమానులు. కానీ అనుకోని రీతిలో ప్రభాస్ అభిమానులకు షాక్ తగిలింది. ఈ సినిమా ఆగష్టు 15వ తేదీ కాకుండా ఆగష్టు 30న విడుదల చేయనున్నారట.   


బాహుబలి సినిమాతో ప్రపంచానికి పరిచయమైనా 'ప్రభాస్'కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సాహూ చిత్రాన్ని మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పైన వస్తున్న ఈ చిత్రాన్నీ వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. ఈరోజే చిత్రీక‌ర‌ణ‌న పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే సాహూ సినిమా వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: