టాలీవుడ్ లోకి ‘ఈశ్వర్’సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఈ సినిమా తర్వతా ప్రభాస్ వరుస విజయాలు అందుకుంటున్న తరుణంలోనే మరోసారి రాజమౌళి ‘బాహుబలి’ ప్రతిష్టాత్మక సినిమా ప్రభాస్ కి అందించాడు.  ఈ సినిమాతో ఏకంగా ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్, సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’మూవీలో నటిస్తున్నారు. 

ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించిన విషయం తెలిసిందే.   రూ.250 కోట్లతో నిర్మితమవుతున్న ఈ మూవీ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతుందని ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ని బట్టి తెలిసిందని అభిమాలను తెగ సంబరపడిపోయారు.  చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోని వెండి తెరపై చూడబోతున్నామన్న సంతోషం ఇప్పుడు నీరుగారిపోయింది.  ఆగస్టు 15న విడుదల కావాల్సిన సాహో సినిమాకు బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా విడుదల ఆగస్టు30కి వాయిదా పడింది.

చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. నిర్మాణానంతరం కార్యక్రమాల విషయంలో జాప్యం సినిమా విడుదల వాయిదాకు కారణమైందని వారు అంటున్నారు.  ఈ సినిమాలో కొన్ని నిమిషాల సన్నివేశాల కోసమే సుమారు 70 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టినట్లు టాలీవుడ్ టాక్.  ఈ మద్య కాలంలో సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోతే ఫ్లాపులు అవుతున్నాయని..ఇప్పడు సాహూ పరిస్థితి ఏంటా అని అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: