దిల్ రాజు అనిల్ సుంకర నిర్మాతలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జగపతి బాబు షూటింగ్ మొదలైన తరువాత ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ఈ రోల్ లో నటిస్తున్నాడు. జగపతిబాబు ఈ మూవీ నుండి తప్పుకోవడంతో ఈ విషయం గురించి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. 
 
 
జగపతి బాబు ఈ సినిమా నుండి తప్పుకోవడానికి దర్శకుడే కారణమని కథ ఒకలా చెప్పి షూటింగ్ లో కథ మార్చటంతో జగపతి బాబు తప్పుకున్నారని, కథలో తన పాత్రకు ప్రాధాన్యత పెంచమని జగపతిబాబు అడిగారని కానీ దర్శకుడు అందుకు ఒప్పుకోకపోవడంతో జగపతిబాబు ఈ సినిమా నుండి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ తెలుస్తున్న సమాచారం మేరకు మహేశ్ బాబే జగపతి బాబుని ప్రకాశ్ రాజ్ కోసం తన పాత్రని త్యాగం చేయమని అడిగారట. మహేశ్ అడిగేసరికి జగపతిబాబు ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. 
 
మహేశ్ బాబు ప్రకాశ్ రాజ్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. మహేశ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలైన ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించాడు.సరిలేరు నీకెవ్వరు సినిమాలో రోల్ కోసం జగపతిబాబుకంటే ప్రకాశ్ రాజ్ ఐతే బాగుంటుందని మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేశ్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2020 సంక్రాంతికి విడుదల కాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: