మిషన్ మంగళ్ గురించి అందరికి తెలుసు. భారత దేశం మార్స్ ఉపగ్రహంపైకి మామ్ ను పంపించింది. 2013 లో చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. దాదాపు ఏడాదిపైగా ప్రయాణించి మార్స్ లోకి మామ్ అడుగుపెట్టింది. ప్రయోగం చేపట్టిన మొదటి సారే సక్సెస్ కావడం విశేషం.
ఈ రియల్ స్టోరీని బేస్ చేసుకొని మిషన్ మంగళ్ పేరుతో సినిమాను తీస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా చేసిన ఈ మూవీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. మార్స్ పైకి ఉపగ్రహం పంపాలని అనుకున్నప్పుడు చాలామంది వ్యతిరేకించారు.
చాలా కష్టంతో కూడుకొని ఉంటుందని, నాసా వంటి అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు కావాలని అంటే.. ఏది ఏమైనా సరే మిషన్ మంగళ్ ప్రయోగం చేపట్టి తీరాల్సిందే అని శాస్త్రవేత్త అక్షయ్ కుమార్ చెప్పడంతో మిషన్ మంగళ్ కు తెరతీస్తారు.
అక్కడి నుంచి ఆ మిషన్ లో శాస్త్రవేత్తలు ఎలా పాల్గొన్నారు. ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు అన్నది కథ. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటించారు. సినిమాను తక్కువ బడ్జెట్ లోనే కంప్లీట్ చేశారు. మిషన్ మంగళ్ ట్రైలర్ కు మంచి పేరు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే.