బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి ప్రేమ కథలతో తెరకెక్కిన కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయన్న విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా టాలీవుడ్ ప్రేమ కథల్లో ఓ కొత్త మలుపుకు దారి తీసిన సినిమాలు ఉన్నాయి. చిత్రం, నువ్వేకావాలి..ఆ కోవలోనివే. అంతేకాదు అలాంటి మరో సినిమాగా మనసంతా నువ్వే గురించి చెప్పుకోవచ్చు. ఉదయ్ కిరణ్ కు స్టార్ స్టేటస్ రావడంలో ఈ సినిమా ప్రభావం చాలా ఉంది. గ్లామర్ ఫ్యాక్టర్ లేకుండా కేవలం ఎమోషన్స్ మీదే దర్శకుడు విఎన్ ఆదిత్య నడిపిన తీరు అప్పట్లో సంచలనం అయింది. డెబ్యూతోనే అంత పెద్ద హిట్టు కొట్టి నాగార్జునతోనే సినిమా చేసే ఛాన్స్ అందుకున్న ఆదిత్య నేనున్నానుతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.

ఆ తర్వాత ఆట ఓ మాదిరిగా ఆడినా నాగ్ ఇచ్చిన రెండో ఛాన్స్ బాస్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆదిత్య చివరిగా తీసిన సినిమా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ముగ్గురు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ వచ్చింది. ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికీ సరైన సబ్జెక్టు మీద వర్క్ అవుట్ చేస్తూ ఇంతకాలం ఆగారట. ఇప్పుడు మళ్ళీ ఒక సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చినట్టుగా లేటెస్ట్ న్యూస్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సుమంత్ అశ్వన్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందబోతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. 

ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సుమంత్ అశ్విన్ తండ్రి ఎంఎస్ రాజు గారి బ్యానర్ లోనే విఎన్ ఆదిత్య రెండు సినిమాలు చేశారు. ఆ రకంగా కూడా బాండింగ్ ఉంది. ఇక అల్లు అరవింద్ ఓకే చేశారు అంటే కంటెంట్ ఉండే ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆదిత్య మళ్ళీ డైరెక్షన్ చేయడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. రీసెంట్‌గా జెర్సి చూసిన ఆదిత్య కొడుకు నువ్వెందుకు దర్శకత్వం చేయడం లేదని అడిగాడని అందుకే ఆ ప్రయత్నాల్లో ఉన్నానని విఎన్ ఆదిత్య చెప్పిన కొద్దిరోజులకే ఈ న్యూస్ రావడం విశేషం. దీనిపై త్వరలోనే అధికారకంగా ప్రకటన రానుందని సమాచారం.   



మరింత సమాచారం తెలుసుకోండి: