తెలుగులో నిత్యా మీనన్ కి మంచి గుర్తింపు ఉంది. ఆమెను ఇష్టపడే అభిమానులు ఉన్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. పలు హిట్ చిత్రాలలో నటించిన నిత్య మంచి సబ్జెక్టులను ఎంచుకుంటూ తెలుగులో తన మార్కెట్ కు ఢోకా లేకుండా చేసుకుంది. గతేడాది వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ గీత గోవిందంలో ఇంపార్టెంట్ రోల్ లో నటించింది.

 

 

 

ప్రస్తుతం నిత్య హిందీలో మిషన్ మంగళ్ అనే సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో నిత్యామీనన్ శాటిలైట్ డిజైనర్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో ఆమెకి ఇదే తొలిచిత్రం. 2013లో ఇస్రో మార్స్ ఆర్బిట్ లోకి ప్రయోగించిన మంగళ్ యాన్ రాకెట్ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఆగష్టు 15న విడుదల కానున్నఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నిత్య నిండైన చీరకట్టులో ఆకట్టుకుంది. చీరకట్టులో, మంచి జ్యూవెలరీతో ఆమె అందంగా మెరిసిపోతోంది.

 

 

 

తెలుగులో చేసిన ప్రతి చిత్రంలో ఆమె ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది. ఎక్కడా ఎక్స్ పోజింగ్ కు తావివ్వకుండానే నటించింది. అయినా ఆమె అందానికి, అభినయానికి ఫ్యాన్స్ ఉన్నారు. నిత్యం పెరుగుతున్న ఆమె అందం ఆమెకు మరిన్ని సినిమాలు తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: