ప్రపంచ స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకున్న బాహుబలి వంటి హిస్టరీ రికార్డ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సినిమా సాహో. ఈ సినిమాను కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్దమవుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆగస్ట్ 15 నుంచి సాహో విడుదల పడిందన్న వార్త కు మళ్ళీ లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తూ యువి సంస్థ అఫీషియల్ గా కొత్త డేట్ ప్రకటించింది. టెక్నికల్‌గా అసలు రాజీ పడకపోవడం వల్లే ఇబ్బందిగా అనిపిస్తున్నా రెండు వారాలు వాయిదా వేయక తప్పలేదని ఆగస్ట్ 30 ని కొత్త డేట్ గా అధికారికంగా చెప్పారు.  

"బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్ళీ వెండితెరపైకి వస్తున్న సాహో ఈ ఏడాదిలోనే అత్యంత వెయిటింగ్ లో ఉన్న మూవీగా మీ ముందుకు రాబోతోంది. ముందు అనుకున్న ప్రకారం ఆగస్ట్ 15 రాలేకపోయినా ఇంతకముందెన్నడు వెండితెరపై చూడనటువంటి యాక్షన్ సీన్స్ ఉన్న ఈ సినిమా విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవకూడదనే రిలీజ్ డేట్ ని మార్చామని స్వతంత్ర దినోత్సవం నాడు రాలేకపోతున్నప్పటికి అదే నెల ఆఖరున వస్తున్నామంటూ చెప్పారు. భారతీయ సినీ చరిత్రలో వెండి తెరమీద ఇంత పెద్ద యాక్షన్ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికే మేము శ్రమిస్తున్నామని చెప్పడం అందరికీ ఒక పెద్ద ఆశను కలుగజేసింది.

రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న సాహోలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా జాకీ ష్రాఫ్, నీల్ నితీష్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, అరుణ్ విజయ్, చుంకీ పాండే వంటి పాపులర్ యాక్టర్స్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను బాలీవుడ్ తో పాటు సౌత్ లో ఉన్న అన్నీ భాషల్లోను రిలీజ్ చేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: