తాజాగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో రామ్ హీరోగా, నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరాయిన్ లుగా పీసీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లలో వచ్చిన సినిమా ఇస్మాట్ శంకర్. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమా మాస్ మసాలాగా ప్రేక్షకులను ఎంతో అలరిస్తున్నది.పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మకు ప్రియమైన శిష్యుడని అందరికీ తెలిసిన విషయమే.ప్రతీ సినిమాకి ట్వీట్ చేసే రామ్ గోపాల్ వర్మ తన ప్రియ శిష్యుడు తీసిన మాస్ మసాలా మూవీ ఇస్మాట్ శంకర్ పైన కూడా ఆయన ట్వీట్ చేస్తూ,ఆ చిత్రానికి ఉచిత పబ్లిసిటీని చేస్తున్నారనే అనుకోవచ్చు.
ఈ రోజు వర్మ ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి మరియు లక్ష్మీస్‌ ఎన్టీఆర్ ఫేం అగస్త్య మంజులతో కలిసి మూసాపేట శ్రీరాములు థియేటర్ లో మధ్యాహ్నం రెండు గంటలకు మాస్ గెటప్ లో బైక్ పైన వెళుతున్నామని ఆయన ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: