అనుష్క తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. అనుష్క కెరీర్ లో అరుంధతి సినిమాలో జేజేమ్మగా అందరూ మెప్పించినా... ఆ తర్వాత వచ్చిన స్వీాటీ చిత్రంలో బాగా బోద్దుగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అప్పటినుంచి అనుష్కను స్వీటీగానే పిలుస్తూన్నారు. మరళ అరుంధతి లా కనిపించడానికి ‘భాగమతి’ చిత్రంలో నటించి ప్రేక్షకులమన్ననలు పొందింది.
‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శెట్టి, ‘భాగమతి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ, ‘నిశ్శబ్ధం’ అనే మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రానుంది. కాగా, ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ గా 14 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘నిశ్శబ్ధం’ చిత్రయూనిట్ స్వీటీకి శుభాకాంక్షలు తెలిపుతూ.. ఈ సినిమా టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి మంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖెల్ మ్యాడసన్ కూడా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమాలో తన లుక్ను తెలుపుతూ అనుష్క ఓ స్టిల్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.