ఫ్లాప్స్ వచ్చిన కొందరు దర్శకులకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. గతంలో వారు సాధించిన ఘన వజయాల ఎఫెక్టే అది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ది ప్రస్తుతం అదే స్తితి. జయ జానకీ నాయక, వినయ విధేయ రామాతో వరుస ప్లాఫ్స్ ఫేస్ చేసిన బోయపాటి శీను వీలైనంత త్వరగా తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.
బోయపాటి కిట్టీలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి.అందులో ఒకటి బాలయ్యతో తెరకెక్కించే సినిమా కాగా మరొకటి గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రం.నిజానికి బోయపాటి, గీత ఆర్ట్స్ కలయిక సినిమా ఇప్పుడు అనుకున్నది కాదు. సరైనోడు సమయంలోనే గీతా ఆర్ట్స్ తో మరో సినిమా చెయ్యడానికి బోయపాటి సైన్ చేశాడంట. చిరంజీవి నూట యాభై ఒకటోవ సినిమాకి బోయపాటిని దర్శకుడిగా అనుకున్నారు.
అయితే చిరంజీవి ఆనుకోకుండా సైరాని రంగంలోకి దించారు.దాంతో గీతా ఆర్ట్స్ లో బోయపాటి సినిమా పక్కకు వెళ్ళిపోయింది.ఎలాగైనా చిరంజీవితో సినిమా చెయ్యాలని బోయపాటి ఆశపడుతున్నాడట.అయితే అందుకు టైం పడుతుందంటున్నారు. ఈలోగా బాలకృష్ణతో సినిమా తెరకెక్కించటానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు బోయపాటి. బోయపాటీని ఆఫర్స్ పలకరిస్తున్నా ముందు బాలయ్యతో సినిమా తీయాలనే ఉద్దేశంతోనే వాటిని పక్కన పెడుతున్నాడట.
బాలకృష్ణతో హిట్టు కొడితే గీత ఆర్ట్స్ తో సహా అగ్ర నిర్మాణ సంస్థలన్నీ మళ్ళీ పైప్ లైన్ లోకి వస్తాయన్నది బోయపాటి ఆలోచనట. అందుకే తన ఫోకస్ అంతా బాలయ్య సినిమా పైనే పెట్టాడు.మరి బాలయ్య తో బోయపాటి సినిమా ఎప్పుడు తెరకెక్కుతోంది..?ఆ తరువాత గీతా ఆర్ట్స్ తో సినిమా వస్తుందా..? అన్నది చూడాలి.