రకాష్ పులిజాల దర్శకత్వంలో శాంతి టెలీఫిల్మ్స్, ఏఎన్‌బి కో-ఆర్డినేటర్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ.. సిరివెన్నల. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధానపాత్రలో నటించగా, మహానటి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బేబి సాయి తేజస్విని నటకిరీటి రాజేంద్రప్రసాద్ మనవరాలు కీలకపాత్ర పోషిస్తోంది.


తాజాగా ఈ చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.


ఈ మూవీ ట్రైలర్ ను చూస్తే  ప్రియమణి, బేబి సాయి తేజస్వినిల నటన, కెమెరా, గ్రాఫిక్ వర్క్, ఆర్ఆర్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచాయి అని అర్ధం కాగా,పగతో రగిలిపోయే ఒక ఆత్మ తన శత్రువులపై ప్రతీకారం ఎలా తీర్చుకుని తనకు జరిగిన అన్యాయానికి న్యాయం ఎలా చేసుకుంటుంది అనే విషయం మీద ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తొంది.నన్ను బంధించడం నీవల్లకాదురా అంటూ బేబి సాయి మరియూ ప్రియమణి నటన  సిరివెన్నెల ట్రైలర్ కు మంచి హైప్ ను తెచ్చిపెడుతొంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఈ చిత్రం చక్కటి శుభారంభాన్నిస్తుందని ప్రియమణి తన నమ్మకాన్ని వ్యక్తం జేశారు.


అజయ్ రత్నం, కాలకేయ ప్రభాకర్, నేహా దేశ్‌పాండే, జెమిని సురేష్ తదితరులు నటించిగా,ఈ సినిమాకి సంగీతం ఏఎన్‌బి కో-ఆర్డినేటర్స్ అందించారు మరియూ చక్కటి విజువల్ ఎఫెక్ట్స్ తో విరించి ప్రొడక్షన్స్ రూపొందించారు. ఈ సినిమా ఆడియో బిగ్ సీడీని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి ఆవిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: