త్రివిక్రమ్ మహత్యమో ఏమో కానీ నాగార్జున నటించిన మన్మధుడు సీక్వెల్ సినిమా ‘మన్మధుడు 2’ బిజినెస్ అదరగొట్టేసింది. గత కొంత కాలం నుండి నాగార్జున చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాగానీ మన్మధుడు సీక్రెట్ కి బాక్సాఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టేసింది. శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా భారీ ఎత్తున మన్మధుడు -2 రేటు బాగా పలికింది.


ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కి వచ్చిన స్పందన చూసి సినిమా డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌ షాకింగ్ కామెంట్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ గమనిస్తే నాగార్జున గత చిత్రాలు 30 కోట్ల లోపు ఉండేది. కాని ఈసారి మాత్రం ఏకంగా 50 కోట్లను క్రాస్‌ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో గెస్ట్‌ రోల్స్‌లో కీర్తి సురేష్‌ మరియు సమంతలు కూడా కనిపించబోతున్నారు. ముగ్గురు ముద్దుగుమ్మలతో పాటు విదేశీ మోడల్స్‌ కూడా చాలా మంది ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఇందుమూలంగా నీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: