తెలుగు చిత్ర పరిశ్రమలో ఆది సాయికుమార్ కావాల్సినంత గుర్తింపు తెచ్చుకోవాడనాని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ప్రేమ కావాలి చిత్రంతో మంచి టాక్ అందుకున్నా... లవ్ లీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా అడలేదు. మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న సాయికుమార్ గత ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

ఇప్పుడు వరుసగా మూడు సినిమాలతో ఈ ఏడాదికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే ఆపరేషన్ గోల్డ్ విష్, బుర్రకథ చిత్రాలు విడదలకాగా అక్కడ కూడా తన సత్తా చూపించలేకపోయాడు. విభిన్న కోణాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సాయికుమార్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో కొత్త చిత్రం చేస్తుండగా మంగళవారం చిత్రబృంధం పోస్టర్ విడుదల చేసింది.

ఆది సాయికుమార్ హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘జోడి’ అనే టైటిల్ తో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన జోడి ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. టీజర్ రేపు ఉదయం 11 గంటల 16 నిముషాలకు విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

ఇక గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకున్న జోడీ త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: