తెలుగు సినిమా ఇండస్ట్రీకి వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్, తొలి సినిమానే మంచి సక్సెస్ సాధించడంతో మెల్లగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. ఇక గతంలో కెరీర్ పరంగా కొన్ని మంచి సక్సెస్ లు అందుకున్న రామ్, కొద్దిరోజులుగా సరైన విజయం దక్కక కొంత ఢీలాపడ్డారు. 

అయితే ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ అయి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో, అదరగొట్టే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా, గడిచిన ఆరు రోజుల్లో రూ.56 కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్ ని సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాక ఈ సినిమాలో దర్శకుడు పూరి, హీరో రామ్ ని చూపించిన మాస్ స్టైల్ కి అలానే అయన నోట పలికించిన డైలాగులకు మాస్ ఫ్యాన్స్ మరియు యువత బాగా ఫిదా అవుతున్నారు. ఇక మొత్తానికి ఈ సినిమా సక్సెస్ తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి వచ్చిన రామ్, తన తదుపరి సినిమాకు రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసినట్లు సమాచారం. 

తనతో తదుపరి సినిమాకై కథలు చెప్పేందుకు వస్తున్న దర్శక, నిర్మాతలకు తన రెమ్యూనరేషన్ పెంపు విషయం రామ్ ఖరాఖండిగా చెపుతున్నారట. ఏది ఏమైనా దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే మాటను రామ్ బాగానే పాటిస్తున్నారు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని ప్రస్తుతం ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: