మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు-హీరో బన్నీ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పనులను చిత్రయూనిట్ చకాచకా పూర్తి చేస్తున్నారు.  అయితే ఈ మూవీలో సీనియర్ నటి టబూ నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన హాట్ బ్యూటీ పూజా హెగ్డె నటిస్తుంది. ఇప్పటికే దువ్వాడ జగన్నాథం సినిమాలో ఈ జోడీ మంచి సక్సెస్ సాధించింది.  తాజాగా ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  గతంలో త్రివిక్రమ్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాల తండ్రి సెంటిమెంట్ తో సూపర్ హిట్ అయ్యింది.  


తాాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా తండ్రి సెంటిమెంట్ తో పాటు ఫుల్ లెన్త్ ఎంట్రటైన్ మెంట్ గా ఉండబోతుందట.  ఈ మూవీ టైటిల్ పై ఇప్పటి వరకు ఎన్నో తర్జన భర్జనలు జరిగాయట.   ఈ సినిమాకి 'నాన్న.. నేను' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నారు. ఈ టైటిల్ నే ఖరారు చేశారనే టాక్ తాజాగా వినిపిస్తోంది.  త్రివిక్రమ్ శ్రీనివాసరావు,  నిర్మాత రాధాకృష్ణ ఆధ్వర్యంలో సినిమాలోని డైలాగులకు బన్నీ డబ్బింగ్ చెబుతున్నారు. 


బన్నీ సరసన  పూజా హెగ్డే, మరో కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్ర కోసం 'ఖడ్గం' సంగీతను తీసుకున్నారని చెబుతున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో ఈ కొత్త సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: