బాహుబలి 2’ విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ప్రభాస్ నుండి సినిమా రాకపోవడంతో అతడి అభిమానులు ‘సాహో’ గురించి విపరీతంగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు కూడ ‘సాహో’ కలక్షన్స్ స్థాయి బట్టి టాప్ హీరోల రేస్ లో ప్రభాస్ స్థానం డిసైడ్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. 

అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా ప్రభాస్ తాను నమ్మిన యంగ్ డైరెక్టర్ సామర్ధ్యం పై నమ్మకం పెట్టుకుని ‘సాహో’ కోసం 300 కోట్లు భారీ ఖర్చు చేయించాడు. ఇది ఇలా ఉండగా వచ్చేనెల 30న విడుదల కాబోతున్న ఈమూవీ ప్రమోషన్ ను నెమ్మదినెమ్మదిగా పెంచుతున్నాడు. 

ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించి శ్రద్ధా కపూర్ ప్రభాస్ లు యాక్షన్ మోడ్ లో ఉన్న ఒక పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ ను చూసి ప్రభాస్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతుంటే మరికొందరు మాత్రం ఈ పోస్టర్ కు ‘బాహోబలి’ లోని ఒక పోస్టర్ కు లింక్ పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

‘బాహుబలి’ లో ప్రభాస్ అనుష్కలు విల్లంబులు పుచ్చుకుని హడావిడి చేసిన సీన్ కు సంబంధించిన పోస్టర్ అప్పట్లో ‘బాహుబలి’ ప్రమోషన్ లో ఒక ట్రెండ్ సెటర్. ఇప్పుడు అదే తీరులో ప్రభాస్ శ్రద్ధా కపూర్ లు తుపాకీలతో యాక్షన్ సీన్ లో కనిపిస్తూ ‘బాహుబలి’ సీన్స్ ను గుర్తుకు చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు యంగ్ డైరెక్టర్ సుదీప్ ఈమూవీ యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేయడంలో ‘బాహుబలి’ ని మనసులో పెట్టుకున్నాడా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీ మ్యానియా మరింత పెంచడానికి ‘సాహో’ లో ప్రభాస్ ఉపయోగించిన కార్లు మోటారు బైకులు ప్రతి ఊరుకు ప్రదర్శనగా తిరుగుతూ వచ్చేనెల రెండవ వారం నుండి హడావిడి చేయబోతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: