నటుడు కావాలంటే అందం కాదు నటన వస్తే చాలు అని 'హృదయ కాలేయం' సినిమాతో రుజువు చేశాడు సంపూర్ణేష్ బాబు. సంపూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అతని మొదటి సినిమా హృదయకాలేయంకు టికెట్లు దొరికాక ప్రేక్షకులు ఎంత ఇబ్బంది పడ్డారు అనేది అందరికి తెలుసు.  


హృదయకాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు 'బర్నింగ్ స్టార్' అని బిరుదు కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బుల్లితెరకు బిగ్ బాస్ మొదటి సీజన్ కి కాంటస్టెంట్ గా కూడా వచ్చారు. అయితే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు మన బర్నింగ్ స్టార్ సంపూ. ఇప్పుడు కూడా 'కొబ్బరి మట్ట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సంపూ. 


అయితే సంపూ తన సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే మన్మథుడు టీం అతనికి ఆశీస్సులు ఇవ్వాలని అయన కోరాడు. ' మేము మా కొబ్బరిమట్ట చిత్రాన్ని ఆగస్ట్ 10న విడుదల చేయబోతున్నాము. మాకు కింగ్ నాగార్జునగారి, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్ గారి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌గారి మరియు వెన్నెల కిషోర్ అన్నగారి ఆశీస్సుల కావాలి. మీ సినిమా హౌస్‌ఫుల్ అయ్యి, టికెట్స్ దొరక్క మా సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. మీ సంపూర్ణేష్ బాబు' అంటూ ట్విట్ చేసారు. ఈ ట్విట్ కి రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ స్పందిస్తూ 'తథాస్తు.. ఆల్ ది బెస్ట్' అంటూ ట్విట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: