సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మందన్న రెండవ సారి కలిసి నటించిన తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యి ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు.
అయితే ఈ రీమేక్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు అప్పుడే ఈరీమేక్ లో కూడా విజయ్ దేవరకొండ నే హీరోగా నటించనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ఆ వార్తలను కొట్టిపారేశాడు. ఇక ఈ రీమేక్ లో 'ధఢక్' పెయిర్ జాన్వీ కపూర్ , ఇషాన్ కట్టర్ ను తీసుకొనేందుకు కరణ్ ప్రయత్నాలు చేస్తున్నడని బాలీవుడ్ మీడియా నుండి వార్తలు వెలుబడ్డాయి. అయితే తాజాగా ఈ వార్తల ఫై కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
డియర్ కామ్రేడ్ రీమేక్ లీడ్ పెయిర్ కోసం ఇంకా ఎవరిని సంప్రదించలేదని ప్రస్తుతానికి ఈ రీమేక్ ప్లానింగ్ లోనే ఉందని తెలియజేశాడు కరణ్ జోహార్. మరి ఈ రీమేక్ లో లీడ్ పెయిర్ గా ఎవరు నటిస్తారో చూడాలి. ఇక ఇంతకుముందు విజయ్ దేవరకొండ నటించిన కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి' , ఖబీర్ సింగ్ గా హిందీ లో రీమేక్ అయ్యింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.