ఇప్పటికే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ రెండు సీజన్లు మంచి సక్సెస్ సాధించడంతో, వీక్షకుల్లో మూడవ సీజన్ పై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తోలి సీజన్, తొట్టతొలిగా మన తెలుగులో ప్రసారం కానుండడంతో, ఇటువంటి షోలు ఇక్కడ పెద్దగా సక్సెస్ కావు అనే వాదన అప్పట్లో కొంత వినపడింది. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ, యంగ్ టైగర్ తన అత్యద్భుత వాక్చాతుర్యంతో షో పై మెల్లగా ఆసక్తిని పెంచుతూ ముందుకు తీసుకెళ్లారు. 

ఆ తరువాత రెండవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాచురల్ స్టార్ నాని, తన వండర్ఫుల్ హోస్టింగ్ టాలెంట్ తో ఆ సీజన్ ను మరింత సక్సెస్ఫుల్ చేసారు. ఇక ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా 15మంది పార్టిసిపెంట్లతో మంచి హైప్ తో ఇటీవల ప్రారంభమైన మూడవ సీజన్, ప్రస్తుతం మంచి జోష్ తో ముందుకు సాగుతోంది. అయితే ఆ 15 మందిలో రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేదానిపై ప్రేక్షకుల్లో ఎంతో ఉత్కంఠత నెలకొని ఉందనే చెప్పాలి. ఇకపోతే నేటి బిగ్ బాస్ షోలోకి తమన్నా సింహాద్రి, వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ కానుందని సమాచారం. స్వతహాగా ట్రాన్స్ జండర్ అయిన తమన్నా, ఇటీవల కొద్దిరోజలుగా యూట్యూబ్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో మంచి పాపులారిటీని సంపాదించడంతో, బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు ఈ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీ కల్పించినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఉన్న అందరూ పార్టిసిపెంట్స్ లో ఎక్కువగా మహేష్ విట్ట, వరుణ్ సందేశ్, వితిక, శ్రీముఖి, హేమ తదితరులు షోలో తమ టాలెంట్ ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారని, వారు ఇలానే ఆడితే ప్రేక్షకుల నుండి బాగా ఓటింగ్స్ సంపాదించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక నేడు షోలోకి తమన్నా ఎంట్రీ తో, షో మరింత రసవత్తరంగా మారే అవకాశం కనపడుతోంది. అయితే తమన్నా ఎంట్రీ పై బిగ్ బాస్ టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, నేడు ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఈ రాత్రి షో మొదలయ్యేవరకు వేచి చూడాల్సిందే....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: