మణిరత్నం తాజాగా "పూనియల్ సెల్వన్" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు .  ఈ సినిమాలో కార్తిక్ , విక్ర్రం , జయం రవి , మొహన్ బాబు , అరవింద స్వామి , విజయ్ సేథుపథి ఇంకా చాలా మంది నటీనటులు ఇందులో భాగంగా ఉన్నారు .  ఈ సినిమాలో మన సీనియర్ నటుడు మోహన్ బాబు గారు ఒక వయసు మాల్లి కింగ్ పాత్రను పోషిస్తున్నారు .  అలాగే అయనకి భార్యగా మన మాజీ మిస్ వరల్డ్ , అతిలోక సుందరి ఐన ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారని సిని పరిశ్రమలో టాక్ వచ్చింది . ఐశ్వర్యరాయ్ కు 40 ఏళ్ళు వచ్చినా సరె ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని , నటి ఐశ్వర్యారాయ్ తన మొదటి సినిమా మరియు క్లాసికల్ చిత్రం  "ఇద్దరు" .  ఈ సినిమాకి దర్శకత్వం వహించింది మణిరత్నం .  సినీ ఇండస్ట్రీ లో ఐశ్వర్యరాయ్ కు  తన గురువు మణిరత్నం గారు అని చెప్పగా తన డైరెక్షన్ లోనే గురు , రావణ వంటి చిత్రాలలో నటించానని ,  తన గురువు విలన్ లక్షణాలుండే పాత్రలను ఇచ్చినా కూడా ఐశ్వర్యరాయ్ నో చెప్పకుండా చేస్తానని తెలిపారు .



రీసెంట్ గా రణబీర్ కపూర్ తో రెచ్చిపోయి రొమాన్స్ చేశారని, అలాంటి నటి ఇప్పుడు విలన్ గా రాబోతున్నారని సినీ పరిశ్రమ వాళ్ళు తెలిపారు.మోహన్ బాబు తో జంటగా నటించటమే కాకుండా ఆ పాత్రలో తనది నెగటీవ్ రోల్ ఉండటం పెద్ద విశేషం. ఐశ్వర్యరాయ్ సౌత్ లో "రోబో" సినిమా చేసి 10 ఏళ్ళు అవుతుంది.ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళ తరువాత దక్షణ సినిమాకి ఐశ్వర్యరాయ్ ఓకె చెప్పారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: