బాక్సాఫీస్ దగ్గర ‘ఓ బేబీ’ పెర్ఫామెన్స్ అంచనాల్ని మించిపోయింది. వారం తిరక్కుండానే ఇది బ్రేక్ ఈవెన్ సాధించింది. గత వారాంతం ఒకటికి మూడు కొత్త సినిమాలు రిలీజైనా ‘ఓ బేబీ’నే బాక్సాఫీస్ లీడర్ కావడం విశేషం. శని, ఆదివారాల్లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడ్డాయి. కొత్త సినిమాల్లో ‘నిను వీడని నీడని నేనే’ మాత్రమే ‘ఓ బేబీ’కి కొంచెం పోటీ ఇచ్చింది.
అయితే ఆమె తాజాగా తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్టు సమాచారం. కొంతకాలం క్రితం వరకూ హీరోలతో కలిసి ఆడిపాడే పాత్రలను మాత్రమే చేసిన సమంత.. ఈ మధ్య కాలంలో నటనకి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన యూ టర్న్, ఓ బేబీ భారీ విజయాన్ని అందుకున్నాయి. ఓ బేబీ సినిమాకి ముందు రూ.2 కోట్ల పారితోషికాన్ని తీసుకున్న సమంత, తన పారితోషికాన్ని కోటి రూపాయల వరకూ పెంచేసినట్టుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంటే సమంత ఇకనుంచి రూ.3 కోట్లు అందుకోనుంది. ఈ పారితోషికంతో సమంత సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న రెండవ నాయికగా పేరు తెచ్చుకుంది. సినిమాకి రూ.5 కోట్ల పారితోషికం అందుకుంటూ తొలిస్థానంలో నయనతార వుంది. ఈ యేడాది తన భర్త నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా సక్సెస్ మాత్రం సమంతకు సెపరేట్ అని చెప్పాలి. రీసెంట్గా ఈ భామ కథానాయికగా నటించిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది. ఈ రకంగా పెళ్లైన తర్వాత కూడా కథానాయికగా సత్తా చూపెడుతోంది