టాలీవుడ్  కింగ్ నాగార్జున హీరోగా  స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ మన్మధుడు-2. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఒక  సాంగ్ మరియు ట్రైలర్, సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేసాయి అనే చెప్పాలి. ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం వచ్చిన మన్మధుడు సమయంలో నాగార్జున ఎలా ఉన్నారో, ప్రస్తుతం దానికి సీక్వెల్ గ రూపొందుతున్న ఈ మన్మధుడు-2లో కూడా అదే మాదిరి ఫిజిక్ మరియు అందంతో కనపడుతున్నారు. 

ఇక ట్రైలర్ లో ఆయనను చూసినవారినందరూ కూడా నాగార్జునకు వయసు పెరగకుండా తగ్గుతోంది అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలెట్టిన ఈ సినిమా, వచ్చేనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున నేడు ఒక జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, అప్పటి మన్మధుడు సినిమాతో పోలిస్తే ఈ మన్మధుడు-2 లో నటించడం కొంత కష్టం అయిందని, అది పూర్తి రొమాంటిక్ అయితే, ఇందులో ఒకింత ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని, అలానే దర్శకులు విజయ్ భాస్కర్ గారు, రాహుల్ ఇద్దరి మధ్య కొంత తేడా ఉందని, 

రాహుల్ తాను అనుకున్న సీన్ బాగా వచ్చే వరకు వదిలిపెట్టడని అన్నారు. ఇక ఈ సినిమాలోని తాను పోషించిన క్యారెక్టర్ ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, రేపు థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతుందని అన్నారు. ఇక తన క్యారెక్టర్ కోసం బాగా వర్కవుట్స్ చేయడం అలానే ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం వంటివి పాటించినట్లు చెప్పారు నాగార్జున. ఇక అప్పటి మన్మధుడు లానే ఇది కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేసారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: