సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ కు ఆకాశమే హద్దు. ఇక నిర్మాత దిల్ రాజు వరుసగా సినిమాలు తీస్తూ టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకడిగా చెలామణీ అవుతున్నాడు. వీరద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అంచనాలు మామూలుగా ఉండవు. ప్రస్తుతం ఇదే జరిగిందని ఫిల్మ్ నగర్ లో వార్తలు షికారు చేస్తున్నాయి.

 

మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని ప్రతి నిర్మాత కలలు కంటాడు. నిర్మాత దిల్ రాజు ఇండస్ట్రీలోని నలుగురు పెద్ద హీరోల్లో నాగార్జున, వెంకటేశ్ తో సినిమాలు తీసాడు. చిరంజీవి, బాలకృష్ణ మిగిలారు. ఇప్పుడు రాజు చిరంజీవితో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు. దీనిపై ఇటివలే చిరంజీవి ఇంటికి వెళ్లి ’మీతో సినిమా తీయాలని నా డ్రీమ్. మీరు ఓకే అంటే బడ్జెట్ ఎంత పెట్టడానికైనా రెడీ’ అని చెప్పాడట. దిల్ రాజు కమిట్మెంట్ తెలిసిన చిరంజీవి ఓకే చెప్పాడని మంచి కథతో రావాలని దిల్ రాజుకు సూచించాడని ఇండస్ట్రీ కోడైకూస్తోంది. 1992లో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానామొగుడు సినిమాను అప్పటి అగ్రనిర్మాత కె.దేవీవరప్రసాద్ నిర్మించాడు. ఈసినిమా తీయడానికి చిరంజీవిని అడిగితే మూడేళ్ల వరకూ కాల్షీట్లు ఖాళీ లేవని చెప్పాడట. అయినా.. మీరెప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే సినిమా తీస్తానంటూ భీష్మించుకు కూర్చున్నాడట. ఈలోపు వేరే సినిమా చేయమని చిరంజీవి చెప్పినా దేవీవరప్రసాద్ చేయలేదట.

 

ఇంతటి క్రేజ్ ఉన్న మెగాస్టార్ తో సినిమా తీయటానికి ప్రొడ్యూసర్లు పోటీ పడుతూంటారు. కానీ ఈమధ్య చిరంజీవి సినిమాలను సొంత బ్యానర్ పై రామ్ చరణే నిర్మిస్తున్నాడు. ఇప్పుడీ వార్త నిజమై చిరంజీవి నిజంగా అవకాశమిస్తే దిల్ రాజు జాక్ పాట్ కొట్టినట్టే. పవన్ తో సినిమా దక్కని రాజుకు చిరంజీవితో సినిమా దక్కనుందా.. చూద్దాం!

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: