ఘట్టమనేని నట వంశం నుండి తెలుగు తెరకు పరచయమైన సుధీర్ బాబు తనని తాను నటుడుగా మలుచుకున్నాడు. తనకి తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయో పాత్రల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేఖమైన స్థానం సంపాయించుకున్నాడు. ఈ మధ్య సుధీర్బాబు సెలెక్ట్ చేసుకుంటున్న కథలు కూడా చాలా వైవిధ్యంగా ఉంటున్నాయట. తాజాగా మరో కొత్త దర్శకుడి చెప్పిన కథను సుదీర్ బాబు ఓకే చేసినట్లు తెలుస్తోంది.
కాగా సూపర్ స్టార్ కృష్ట ఫ్యాన్స్ అంతా సుధీర్ బాబుని కూడా మొదటి నుంచి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. దాంతో పాటే సుధీర్ బాబు కూడా ఒక్కో మెట్టు చాలా జాగ్రత్తగా ఎక్కుతూ హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా కెరీర్ సాగిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథాచిత్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొన్ని రాంగ్ స్టెప్స్ వేసిన సుధీర్ బాబు, ఆ తరువాత చాలా సెలెక్టివ్ గా ఉంటూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్స్ అంటూ తమకు ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఇంద్రగంటి, చంద్రశేఖర్ యేలేటి కృష్ణవంశీ వంటి దర్శకులు సుధీర్ బాబుతో సినిమాలు చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారట.
పైగా సుదీర్ బాబును ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగానే ఆదరిస్తారు. ఇక సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి నన్నుదోచుకుందువటే అనే చిత్రాన్ని తీసి ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారు. అదే ఊపులో బాలీవుడ్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నారు. భాగీ లో విలన్ గా నటించిన ఈ తెలుగు హీరోకి ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్లు కూడా తలుపు తడుతున్నాయి.
ప్రస్తుతం పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సుధీర్ బాబు, దాంతో పాటే తెలుగు నాట నానితో కలిసి నటిస్తున్నాడు. వీరిద్దరిలో కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వి అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నారు. ఏదైతేనేం ఓ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకులకి ప్రస్తుతం సుదీర్ బాబే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.