టెంపర్ తర్వాత పూరి జగన్నాథ్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. రిలీజైన దగ్గర నుండి సూపర్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంది ఇస్మార్ట్ శంకర్. వాటిని మరింత పెంచేందుకు పూరి అండ్ టీం తెలుగు రెండు రాష్ట్రాల్లో స్పెషల్ టూర్ ప్లాన్ చేశారు.


ఆంధ్రా మొత్తం పూర్తి కాగా త్వరలో తెలంగాణాలో కూడా టూర్ ఉంటుందని చెప్పారు. ఈ టూర్ లో డైరక్టర్ పూరి, నిర్మాత ఛార్మి, హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రమే పాల్గొన్నారు. ఇక నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో కూడా రామ్ మిస్ అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కేవలం తన వల్లే అన్నట్టుగా పూరి చెప్పుకుంటున్నాడా అన్న టాక్ వస్తుంది.   


ఏమాటకామాట చెప్పుకోవాలి కాని రామ్ కూడా సినిమాలో ఇదవరకు ఎప్పుడు చూపించని ఎనర్జీతో కనిపించాడు. కాని పూరి సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటున్నాడు. టూర్ కి రాలేదు సరే కాని సినిమా సక్సెస్ మీట్ కు రామ్ రాకపోవడంతో అనుమానాలను కలిగిస్తుంది. సినిమా సక్సెస్ అయిన తర్వాత పూరి, ఛార్మి చేస్తున్న ఓవరాక్షన్ రామ్ కు నచ్చలేదని అందుకే సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నాడని టాక్. 


సినిమాకు తాను చేయాల్సిందంతా చేశాను ఇక నన్ను వదిలేస్తే బెటర్ అనుకున్నాడేమో అంటున్నారు. మొత్తానికి పూరి మళ్లీ హిట్ కొట్టడం మంచి విషయమే కాని తను ఇలాంటి సినిమాలు చేస్తేనే ఆడియెన్స్ చూస్తారంటూ మళ్లీ ఇలాంటి కంటెంట్ తోనే వస్తే మాత్రం మళ్లీ అతన్ని ఫ్లాప్ జోన్ లోకి నెట్టేస్తారు. సో హిట్టు వచ్చింది కదా అని ఎగిరిపడకుండా జాగ్రత్త పడితే బెటర్.  



మరింత సమాచారం తెలుసుకోండి: