సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా సూపర్ హిట్ అయినా ప్రొఫెసర్ కి పెద్దగా మిగిలింది ఏమీ లేదు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. సినిమాలో అనవసరపు సన్నివేశాలకు బడ్జెట్ ఎక్కువ కేటాయించడం మరోపక్క మహేష్ బాబు రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో తీసుకోవడంతో సినిమా విడుదలయ్యాక సినిమాకి పెట్టిన డబ్బులు వస్తే చాలు అన్నట్టు మారిపోయింది. అయితే మరోపక్క బాక్సాఫీస్ దగ్గర ఎలా లాభాలు సాధించాలి ప్రేక్షకుల నాడిని బాగా కనిపెట్టి సరైన సమయంలో మహర్షిని అద్భుతంగా రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ని తన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సరిలేరు నీకెవ్వరు సినిమాకి కూడా నిర్మాతగా బాధ్యతలు చేపట్టాలని మహేష్ బాబు వచ్చేది తెచ్చినట్లు సమాచారం.


దీంతో మహేష్ బాబు కోరిక మేరకు సినిమా నిర్మాణం లో భాగమైన దిల్‌ రాజు దీనికి మహేష్‌ డిమాండ్‌ చేసిన పారితోషికం పట్ల హ్యాపీగా లేడని గాసిప్స్‌ వున్నాయి. ఈ చిత్రానికి మహేష్‌ వాటాగా యాభై కోట్లు పైగానే వెళుతుందనేది ఇండస్ట్రీ టాక్‌. హీరోనే అంత తీసుకుపోతే ఇక సినిమా బడ్జెట్‌ ఎంత అవుతుంది? చివరకు నిర్మాతకి ఏమి మిగులుతుంది? అంటూ అసహనం చెందినట్లు..పైగా లాభాల్లో కూడా మహేష్ బాబు ఆటో నడుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు డిమాండ్లకు నిర్మాత దిల్ రాజ్ కి పిచ్చెక్కినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోల తరహాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితుల్లో ఉన్నట్లు ఇటీవల దిల్ రాజు కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తుల దగ్గర పేర్కొన్నట్లు సమాచారం. మరోపక్క 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాలు రెండు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా కూడా హిట్ అవ్వాలి అని గట్టిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కి మహేష్ తెలియజేయడంతో మరోపక్క మహేష్ అభిమానులు కూడా ఈ సినిమాతో మహేష్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: