అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్... సినీ ప్రియులకు ఈపేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దడక్ సినిమాతో బాలీవుడ్లో వెండితెరపై మెరిసిందీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో ఇషాన్ ఖత్తర్తో కలిసి నటించింది. అయితే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల వీరిద్దరు ఫంక్షన్లు, డిన్నర్లలో కలిసి కనిపిస్తున్నారు. దీంతో జాన్వి , ఇషాన్ ప్రేమలో పడ్డారని బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
ఇది ఇలా ఉండగా, తాజాగా వస్తున్న ఈ రూమర్స్పై జాన్వి తండ్రి బోనీ కపూర్ స్పందించారు. తన కూతురుకు ఎలాంటి ప్రేమ వ్యవహరాలు లేవని తేల్చేశారు. 'ధడక్'లో హీరో హీరోయిన్లుగా వీరిద్దరే కలిసి నటించడం వల్ల మంచి స్నేహితులయ్యారన్నారు. అంతే తప్పా అంతకు మించి వారిద్దర మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవన్నారు బోనీ కపూర్. కూతురిపై తనకు గౌరవం ఉందని అన్నారు. మరోవైపు జాన్వీ మాత్రం తనపై వచ్చిన రూమర్స్ ఏమాత్రం పట్టించుకోకుండా చక చక షూటింగ్స్లో బిజీగా ఉంది. కానీ జాన్వీ లవ్ ఎఫైర్ గురించి పలు న్యూస్పేపర్స్ లోను, మీడియా చానెల్స్ ల్లోనూ కధనాలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ జాన్వీ సరైన స్పందన లేదు.
కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఫైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో జాన్వి కపూర్ నటిస్తుంది. ఈ సినిమాకు 'కార్గిల్ గర్ల్' అనే టైటిల్ను తాత్కాలికంగా అనుకుంటున్నారు. ఈ చిత్రంలో గుంజన్ పాత్ర కోసం ఏకంగా ఆరు కిలలో బరువు తగ్గి చాలా ఫిట్గా మారింది. ఈ చిత్రంఓ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఆమె నటిస్తోన్న మరో సినిమా 'రూహియోఫ్జా' కోసం కొత్తగా జాన్వి కసరత్తులు ప్రారంభించింది.