టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. ఆరు వరుస ప్లాపుల తర్వాత వచ్చిన హిట్ కావడంతో పూరి ఆనందానికి అవధులే లేవు. ఈ సినిమా హిట్ ఒక్క పూరికే కాదు రామ్ కెరీర్కు కూడా ఊపిరి లూదింది. రామ్ హీరోగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబడుతుంది.
1 రోజులకు గానూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. లాంగ్ రన్లో శంకర్ రూ.40 కోట్ల షేర్ కూడా రాబడుతుందని లెక్కలు వేస్తున్నారు. ఇక ఇస్మార్ట్ హిట్తో పూరి తరువాత సినిమా పై సోషల్ మీడియాలో రూమర్స్ ఊపందుకున్నాయి. కాగా తాజాగా పూరి తన తరువాత సినిమాని రాకింగ్ స్టార్ యశ్ తో చెయ్యబోతున్నాడట. ఈ వార్త ఇప్పుడు ఇటు తెలుగు, అటు కన్నడ ఇండస్ట్రీలను ఊపేస్తోంది.
కేజీఎఫ్ చాప్టర్- 1లో కథానాయకుడిగా నటించిన యశ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో యశ్తో పాటు అటు దర్శకుడు ఓవర్ నైట్ స్టార్లు అయిపోయారు. ఇక ఇప్పుడు రూ.200 కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్తో కేజీఎఫ్ -2 కూడా వస్తోంది.
ఈ సినిమా తర్వాత యశ్ చేసే సినిమా పూరీతోనే ఉంటుందట. ఎప్పటినుంచో తానూ మహేష్ బాబుతో తీయాలనుకుంటున్న ‘జనగణ మన’ సినిమాను యశ్ తో చేయాలని పూరి అనుకుంటున్నాడట. యశ్ సైతం పూరి సినిమా పై ఆసక్తిగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. పూరి కన్నడలో ఇషాన్ లాంటి యంగ్ హీరోలతో రోగ్ లాంటి సినిమా తీశాడు. ఇక్కడ పూరి హిట్ సినిమాలు అక్కడ బాగా ఆడాయి. మరి ఇప్పుడు యశ్తో పూరి సినిమా చేసే వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.