నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తరువాత ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కాగా శరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం కాకినాడ లో జరుగుతుండగా అల్లు అర్జున్ ఈ రోజు కాకినాడ చేరుకొని షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక బన్నీ వస్తున్నాడని తెలుసుకొని అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ షెడ్యూల్ లో కాకినాడ పోర్ట్ లో అలాగే తూర్పు గోదావరి పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇక గత కొద్దీ రోజులుగా ఈసినిమా ఫై నెగిటివ్ ప్రచారం ఎక్కువతుంది. గిట్టనివాళ్ళు ఈ సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలను పట్టించుకోని చిత్ర యూనిట్ ప్రశాంతంగా షూటింగ్ ను కొనసాగిస్తున్నారు.
తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా సీనియర్ నటి టబు ,ప్రముఖ మలయాళీ నటుడు జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు కీలక పాత్రల్లో నటిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అన్ని కుదిరితే సినిమా ను దసరా కు ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కు ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినషన్ లో తెరకెక్కిన జులాయి ,సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతారోలేదో చూడాలి.