యంగ్ హీరో నితిన్ దాదాపు సంవత్సరం గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలను అనౌన్స్ చేసి షూటింగ్స్ లో బిజి బిజీగా గడుపుతున్నాడు. వరుస ఫ్లాప్స్ రావడంతో ఇక నుంచి జాగ్రత్త వహిస్తూ కథల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'రంగ్ దే' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఈ టైటిల్..పోస్టర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అంతేకాదు నితిన్-కీర్తి సురేష్ కాంబినేషన్ అనగానే అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. 

ఇక ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. అంతేకాదు టైటిల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ అప్పటి నించే రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. కాగా ఈ సినిమాకి కెమెరా మెన్ గా పనిచేస్తున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ ఈ మూవీపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు ఈ ట్వీట్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ అని కూడా అర్థమవుతోంది.  

'నితిన్, కీర్తి సురేష్ ల నటన అత్యున్నతంగా, గుర్తుండిపోయేలా ఉంది. 2020 సంవత్సరం మాజీవితాలను రంగుల మయం చేయనుంది' అని ట్వీట్ చేశారు. 'రంగ్ దే' సినిమా కోసం హీరో నితిన్,కీర్తి సురేష్ పోటీపడి మరీ నటిస్తున్నారని ఆయన ట్వీట్ చెబుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఇక గతంలో నితిన్-నిత్యా మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇష్క్ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీ రామ్. మళ్ళీ అదే సెంటిమెంట్ వర్కౌట్ అయి రంగ్ దే కూడా బ్లాక్ బస్టర్ కానుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: