అల్లుఅర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రివిక్రమ్, తర్వాత బన్నీతో పనిచేస్తుండటంతో  ఈ సినిమా మీద అంచనాలు ఇప్పటికే తారా స్థాయిలో ఉన్నాయి. అజ్ఞాతవాసి రూపంలో భయంకరమైన ఫ్లాప్ మూటగట్టుకున్న త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాతో గాడిలో పడ్డాడు. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు కాకుండా సగటు ప్రేక్షకులును కూడా మెప్పించడంతో, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా మీద అదే అంచనాలు నెలకొని ఉన్నాయి. 


అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో  కొన్ని సీన్లు కాకినాడ బీచ్ లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ అభిమానులకు రాలేదు. మామూలుగా అయితే ఏదైనా పెద్ద సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కావాలని అభిమానులు సోషల్ మీడియాలో అభ్యర్థిస్తుంటారు. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ సినిమా విషయంలో అభిమానులు సినిమా గురించి కొత్త న్యూస్ ఏదైనా వస్తుందా అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు  . ఎట్టకేలకి అల్లు అర్జున్ అభిమానులు సంతోష పడే విధంగా  ఈ సినిమా గురించి ఒక కొత్త న్యూస్ రాబోతుందని తెలుస్తుంది. 


 సాధారణంగా  ఏదైనా పెద్ద హీరో సినిమా  షూటింగ్ దశలో ఉన్నప్పుడు హీరో,  దర్శకుడు కాకుండా మిగతా వారు  సినిమా గురించి ఏదైనా న్యూస్ రాబోతుంటే ట్విట్టర్ లో షేర్ చేస్తారు. ఈ సినిమాకి మ్యూజిక్ దర్శకుడుగా తమన్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లో తమన్  స్పందిస్తూ ఈ సినిమా గురించి త్వరలో  ఎగ్జైటింగ్  న్యూస్ రాబోతుందని చెప్పుకొచ్చారు. అయితే తమన్ ట్విట్టర్ లో ట్వీట్ చూసిన అభిమానులు ఏ అప్ డేట్ రాబోతుందని ఇప్పుడు సస్పెన్స్ తో చచ్చిపోతున్నారు. తమన్ ఆ అప్ డేట్ ఎదో చెప్పకుండా ఇంకా సస్పెన్స్ పెంచేశారు. దీనితో అభిమానులు ఆలోచనలో పడ్డారు. 





మరింత సమాచారం తెలుసుకోండి: