సాధారణంగా క్రీడలు వినోదం కోసం ఆడతాం. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఆట స్థలాల నుంచి మన అరచేతిలోని స్మార్ట్ ఫోన్లలో ఆడతున్నాం. వాటినే మనం ముబైల్ గేమ్స్ అని చెబుతాం. పని వత్తిడి వల్ల కొంత మంది గేమ్స్ ఆడుతుంటే... డబ్బుల కోసం మరికొంత మంది ఆడుతున్నారు. డబ్బులు పెట్టి ఆడే గెమ్స్ కూడా ఈ మధ్య వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తాజాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహోను కూడా గేమ్ రూపంలో ఆవిష్కరించారు.

నిజానికి తెలుగు సినిమాలకు ఇలా వీడియో గేమ్స్ లాంఛ్ చేయడం కొత్తేంకాదు. గతంలో కొన్ని సినిమాలకు సంబంధించి ఇలానే వీడియో గేమ్స్ వచ్చాయి. అయితే వాటితో పోలిస్తే ఇది త్రీడీ-యానిమేషన్ తో లేటెస్ట్ టెక్నాలజీతో తెరకెక్కింది. హైదరాబాద్ కు చెందిన పిక్సలాట్ లాబ్స్ కంపెనీ ఈ గేమ్ ను క్రియేట్ చేసింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా సాహో - ది గేమ్  వస్తోందనే విషయాన్ని ప్రభాస్ అఫీషియల్ గా ప్రకటించాడు.

ఈ నెల రెండో వారంలో ప్రభాస్ చేతులమీదుగానే ఇది లాంఛ్ కాబోతోంది. అంతేకాదు, ఫస్ట్ గేమ్ ను కూడా ప్రభాసే ఆడనున్నాడు. సాహో గేమ్ ఆడటం వల్ల మనకేంటీ లాభం అనుకుంటున్నారు కదా...? ఈ గేమ్ ఆడటం వల్ల సినిమా టికెట్లు పొందే అవకాశం ఉంది. ముందుగా గేమ్ గురించి తెలుసుకుందాం... సాహో సినిమాకు సంబంధించి డిఫరెంట్ గా ప్రమోషన్ ప్లాన్ చేశారు. ఈనెల రెండో వారంలో లాంఛ్ కాబోతున్న ఈ గేమ్ ను సాహో థీమ్ తో డిజైన్ చేశారు. ఇందులో హీరో అచ్చం ప్రభాస్ లానే ఉంటాడు. గేమ్ ఎవరైతే ఆడతారో వాళ్లే ప్రభాస్ అన్నమాట.

తన చేతిలో ఉన్న హైటెక్ వెపన్ తో సిటీలో ఉన్న గ్యాంగ్ స్టర్లను తుదముట్టిస్తాడు. గేమ్ ఆడేవాళ్లకు వాళ్ల పెర్ఫార్మెన్స్ బట్టి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ ఆధారంగా సాహో సినిమాలో ప్రభాస్ వాడిన యాక్ససిరీస్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. సాహో మూవీ టిక్కెట్లు కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: