యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా `రైడ్‌`, `వీర` చిత్రాల ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఏ స్టూడియోస్‌, ఎ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `రాక్షసుడు`. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగాఆగ‌స్ట్ 2న విడుద‌ల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌పుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...


బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఈరోజు నాకు చాలా మెమొరబుల్ డే. మార్నింగ్ నిద్ర లేవగానే ఓవర్‌సీస్ నుండి మా కజిన్స్ ఫోన్ చేశారు. అందరూ సినిమా గురించి పాజిటివ్‌గా చెప్పారు. ఆ పాజిటివ్ వైబ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఇంత మంచి హిట్ ఇచ్చిన సత్యనారాయణగారికి జన్మంతా రుణపడి ఉంటాను. ఈ సినిమా రైట్స్ కోసం పెద్ద పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. సత్యనారాయణగారు ఖర్చుకు వెనకాడకుండా రైట్స్‌ను కొని మాపై నమ్మకంతో మాకు ఇవ్వడమే బిగ్గెస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను. సత్యనారాయణగారి బ్యానర్‌లో తొలి సినిమా చాలా పెద్ద హిట్ కొట్టారు. వేల మందికి ఆయన విద్యాదానం చేశారు. ఇప్పుడు మా ఇండస్ట్రీలో ఫ్రొఫెషనల్ పరంగా అక్యూపెషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆయనతో పనిచేసినందుక హ్యాపీ. మళ్లీ మళ్లీ ఆయనతోనే పనిచేయాలని కోరుకుంటున్నాను. సత్యనారాయణగారు ప్రేమించి సినిమాను తీశారు. ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడింది. ఈసినిమాలో పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉంది. అనుపమ, రాజీవ్‌గారికి, జిబ్రాన్ సహా అందరికీ థ్యాంక్స్. కమర్షియల్ హిట్టే కాదు.. క్రిటిక్స్ దగ్గర నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిషేక్ గారితో ఎప్పటి నుండో మంచి అనుబంధం ఉంది. ఆయన ఇక్కడే కాదు.. ఓవర్‌సీస్‌లోనూ బిగ్గెస్ట్ రిలీజ్ చేశారు. ఆయనకు థ్యాంక్స్`` అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: