'భరత్ అనే నేను','మహర్షి' వరుస హిట్లతో దూసుకుపోతున్న గ్లామరస్ మరియు సూపర్‌స్టార్ ఐన మహేష్ బాబు నటిస్తున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కనుంది.ఈ చిత్రానికి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు .ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న  ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది .ఈ చిత్రానికి నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించనున్నాడని మరియు ఆయన సరసన రష్మిక నటిస్తుంది అని నిర్మాత సుంకర తెలిపారు.అంతే కాకుండా విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు అని నిర్మాత తెలిపారు . మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా ట్రైన్‌లో నిల్చున్న మహేష్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు నిర్మాత అనిల్ సుంకర.


ఫొటోని సోషల్ మీడియా లో షేర్ చేయటంతో పాటు కామెంట్ కూడా పోస్ట్ చేశారు.సంక్రాంతి రేసులో నవ్వించేందుకు నవ్వుల ఎక్స్‌ప్రెస్ కదులుతోందని,నవ్వుల కెప్టెన్ అనిల్ రావిపూడితో కలిసి మన సూపర్‌స్టార్ 2020 సంక్రాంతిన  అలరించేదుకు సిద్ధంగా ఉన్నారు అని  కామెంట్ చేశారు . మరి క్రేజీ కాంబినేషన్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయని తెలిపారు .


మరింత సమాచారం తెలుసుకోండి: