సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న  'సరిలేరు నీకెవ్వరు' ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన ట్రైన్ సెట్‌ లోశరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఈ  రైలు సీక్వెన్స్   సినిమాలోనే  చాలా కీలకమైన ఎపిసోడ్ అట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ కానుంది.  ఆగస్టు 9న ఈ సినిమాలోని  మహేష్ బాబు ఫస్ట్ లుక్ కి సంబంధిచిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.  ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపించబోతున్నారో అని  సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.  మహర్షిలో మహేష్ బాబు మూడు లుక్స్  లో కనిపించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు లుక్  సినిమా మొత్తం ఒకటే ఉంటుందట. 


మొత్తానికి 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ గెటప్ మారినా లుక్ మాత్రం మారదట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి.  ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన  రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది.   


కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో  జరుగుతున్న  షెడ్యూల్ లో  మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్  అలాగే కొంతమంది  ముఖ్య  తారాగణం కూడా పాల్గొంటున్నారు.  ఈ చిత్రాన్ని  దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  


సూపర్ స్టార్ మహేష్ బాబు  టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న  'సరిలేరు నీకెవ్వరు' ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన ట్రైన్ సెట్‌ లోశరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఈ  రైలు సీక్వెన్స్   సినిమాలోనే  చాలా కీలకమైన ఎపిసోడ్ అట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం  ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ రివీల్ కానుంది.  ఆగస్టు 9న ఈ సినిమాలోని  మహేష్ బాబు ఫస్ట్ లుక్ కి సంబంధిచిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.  ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ ఎలా కనిపించబోతున్నారో అని  సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.  మహర్షిలో మహేష్ బాబు మూడు లుక్స్  లో కనిపించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మాత్రం మహేష్ బాబు లుక్  సినిమా మొత్తం ఒకటే ఉంటుందట. 


మొత్తానికి 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ గెటప్ మారినా లుక్ మాత్రం మారదట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డ్ స్థాయిలో శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి.  ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన  రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే  ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో  ఓ కీలక పాత్రలో నటిస్తోంది.   


కాగా ప్రస్తుతం హైదరాబాద్ లో  జరుగుతున్న  షెడ్యూల్ లో  మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్  అలాగే కొంతమంది  ముఖ్య  తారాగణం కూడా పాల్గొంటున్నారు.  ఈ చిత్రాన్ని  దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: