టాలీవుడ్ కి చెందిన బడా ఫ్యామిలీలైన మెగా ఫ్యామిలీ అలానే నందమూరి ఫ్యామిలీలకు సంబందించిన కుటుంబ వ్యక్తుల మధ్య ఎటువంటి మనస్పర్థలు కానీ, వ్యక్తిగత ద్వేషాలు కానీ ఎప్పుడూ లేనప్పటికీ, సినిమాల పరంగా ఆ రెండు కుటుంబాల హీరోల అభిమానులు మాత్రం తరచు వాదించుకోవడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మా హీరోలు గొప్ప అంటే, మా హీరోలు గొప్ప అంటూ ప్రస్తుతం ఈ రెండు ఫ్యామిలీల అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో మాటల యుద్ధం చేస్తున్నారు. ఇకపోతే నేడు స్నేహితుల దినోత్సవం కావడంతో, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో తనతో కలిసి నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తనకున్న స్నేహబంధాన్ని తెల్పుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. 

ఒకప్పుడు గ్రీకు దేశానికి గొప్ప ఫిలాసఫర్ అయిన సోక్రటీస్, స్నేహ బంధం గురించి చెప్పిన ఒక మాటను గుర్తు చేస్తూ, 'స్నేహం చేయడానికి తొందరపడకు, ఎందుకంటే ఒకవేళ స్నేహం చేసిన తరువాత ఏమైనా తప్పు జరిగి ఆ బంధం చివరకు అనుకోని కారణాల వలన తెగిపోతే మనకు ఎంతో బాధకలుగుతుంది. అదే మనం ఎవరితోనైనా స్నేహబంధాన్ని కొనసాగించినపుడు దానికోసం చివరి వరకు కృషితో, చిత్తశుద్ధితో చివరి వరకు నిలబడు' అనే మాటను షేర్ చేస్తూ చరణ్ కు ఫ్రెండ్ షిప్ డే విషెస్ తెలిపారు. అయితే ఎన్టీఆర్ ట్వీట్ పై స్పందించిన రామ్ చరణ్, కొత్త బంధాలు ఏర్పడ్డాయి, తారక్ తో కలిసిన ఈ బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఆయన కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ దానిని రిట్వీట్ చేసారు. ఇక నేటి ఉదయం నుండి వీరిద్దరి ట్వీట్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

ఇక మరీ ముఖ్యంగా ఈ ట్వీట్స్ తర్వాత మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మధ్య చాలావరకు సయోధ్య కుదిరినట్లు సమాచారం. అంతేకాక ఆ రెండు ఫ్యామిలీల ఫ్యాన్స్ కూడా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కొట్టి, తమ ఇద్దరు హీరోలకు మంచి పేరు రావాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అందరు హీరోల అభిమానుల మధ్య ఇటువంటి సుహృద్భావ ఆరోగ్యకర పోటీ ఉంటె బాగుటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు రానున్నట్లే...!!   


మరింత సమాచారం తెలుసుకోండి: