‘మన్మథుడు 2’  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున గతంలో తాను నటించిన ‘మన్మధుడు’ మూవీ యూనిట్ కు పనిచేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపి ముఖ్యంగా ఆమూవీ దర్శకుడు విజయ్ భాస్కర్ ను ఆకాశంలోకి ఎత్తేసిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎంతో పేరు తీసుకు వచ్చిన ఆమూవీకి కథ కథనం మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక్క మాట కూడ మాట్లాడకపోవడం వెనుక అఖిల్ కారణం అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు అఖిల్ మొదటి సినిమా ఫ్లాప్ అయిన తరువాత నాగార్జున స్వయంగా అఖిల్ కు ఒక సినిమా చేసి పెట్టమని త్రివిక్రమ్ ను కోరినట్లు టాక్. అంతేకాదు ఆమూవీకి సంబంధించి ఎంత బడ్జెట్ అయినా ఫర్వాలేదు అనీ త్రివిక్రమ్ ఎంత కోరితే అంత పారితోషికం ఇస్తాను అని నాగార్జున చెప్పినట్లు సమాచారం.

అయితే నాగ్ రాయబారాలకు అప్పట్లో త్రివిక్రమ్ స్పందించకపోవడంతో అప్పటి నుంచి నాగ్ త్రివిక్రమ్ ల మధ్య చిన్న గ్యాప్ వచ్చింది అని అంటారు. అందువల్లనే అప్పట్లో త్రివిక్రమ్ స్పందించక పోవడంతో నాగార్జున విక్రమ్ కుమార్ తో అఖిల్ ను హీరోగా పెట్టి తన సొంత బ్యానర్ పై ‘హలో’ నిర్మించవలసిన పరిస్థితులు వచ్చాయి అని కూడ అప్పట్లో వార్తలు వచ్చాయి. 

దీనితో ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని నాగ్ వ్యూహాత్మకంగా త్రివిక్రమ్ పేరును కూడ కనీసం ‘మన్మధుడు 2’ ఫంక్షన్ లో చెప్పలేదు అని అంటున్నారు. ఒకవైపు ‘మన్మధుడు 2’ తన గత మూవీ ‘మన్మధుడు’ కు సీక్వెల్ కాదు అని నాగార్జున చెపుతూ మరొక వైపు మన్మధుడు ప్రస్తావన మన్మధుడు 2 ఫంక్షన్ లో నాగార్జున తీసుకురావడం వెనుక నాగ్ కు త్రివిక్రమ్ పై ఉన్న కోపమే కారణం అంటూ మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: