రెండు వారాల క్రిందట ప్రారంభమైన బిగ్ బాస్ షో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ హౌస్లో ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో పునర్నవి గట్టిగా మాట్లాడుతుందని హిమజ గట్టిగా అరచింది.తమన్నా మాట్లాడుతూ ఈ హౌస్లో అందరూ మంచివాళ్ళే నేనొక్కటే చెడ్డదాన్ని అని ఇంటి సభ్యులతో అన్నది. వితిక, రవికృష్ణకు ఇచ్చిన టాస్క్ లో ఇద్దరూ రెడ్, గ్రీన్ కాంబినేషన్లో బటన్ ప్రెస్ చేయడంతో బిగ్ బాస్ హౌస్లోని మగవారందరూ వారం రోజుల పాటు లివింగ్ ఏరియాలో నిద్రపోవాలని బిగ్ బాస్ చెప్పాడు. 
 
 
మహేశ్ విట్టా మాటాడుతూ పునర్నవి, వితిక ఇంట్లో బ్యాడ్ గా ఉన్నారని బాబా భాస్కర్ తో అన్నారు. వరుణ్ సందేశ్ ఇంటి కెప్టెన్ అయినందుకు ఈ వారం నామినేషన్ నుండి బిగ్ బాస్ తప్పించాడు. బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వారిపై నామినేషన్ స్టాంప్ వేయాలని బిగ్ బాస్ సూచించారు. ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బాబా భాస్కర్, రోహిణిని నామినేట్ చేసారు. వితిక శివ జ్యోతిని (సావిత్రిని) నామినేట్ చేయటంతో శివ జ్యోతి వితికను నామినేట్ చేసింది. 
 
అషు రెడ్డి తమన్నాను నామినేట్ చేసి అలీ అషు రెడ్డి చేసిన చేసిన టాస్క్ లో తనను సిగ్గు లేదా అని అందరిముందు అందని అందుకే నామినేట్ చేసానని చెప్పారు. వరుణ్ సందేశ్ శ్రీముఖిని నామినేట్ చేసి శ్రీముఖి గ్రూపులు మొదలుపెట్టిందని అన్నాడు. బాబా భాస్కర్ వితిక, పునర్నవిని నామినేట్ చేసారు. పునర్నవి తనకు తాను నామినేట్ చేసుకుని తనకు ఇంట్లో ఉండాలని లేదని అన్నారు. బిగ్ బాస్ మాట్లాడుతూ మీరు ఇతరుల్ని నామినేట్ చేయకపోతే ఇంటిసభ్యులందరినీ నామినేట్ చేస్తామని అన్నారు. వరుణ్ సందేశ్ పునర్నవిని ఓదార్చటంతో పునర్నవి శివజ్యోతి, బాబా భాస్కర్ ను నామినేట్ చేసింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ వారం తమన్నా సింహాద్రి, పునర్నవి, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వితికా షేరు నామినేట్ అయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: