తల అజిత్ నటించిన తాజా చిత్రం 'నెర్కొండ పరవాయ్' విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అందేంటీ ఈసినిమా ఇంకా విడుదల కాలేదు కదా అనుకుంటున్నారా .. అయితే ఈ రోజు క్రిటిక్స్ కోసం స్పెషల్ షో ఏర్పాటు చేశారు నిర్మాతలు. మాములుగా స్టార్ హీరోలు నటించిన సినిమాలకు ప్రెస్ షో వేయరు. కానీ చాలా రోజుల తరువాత అజిత్ నటించిన ఈ సినిమా కు ప్రెస్ షో వేయడం జరిగింది. ఇక ఈషో లో సినిమాను వీక్షించిన సినీ విశ్లేషకులు సినిమా ఫై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ అదిరిపోయిందని ముఖ్యంగా కోర్టు సీన్ లో అజిత్ యాక్టింగ్ , డైలాగ్స్ సూపర్ అనే టాక్ వినిపిస్తుంది. అలాగే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ సినిమాకు అదనపు బలంగా నిలిచిందట. ఇక ఈ సినిమా కోలీవుడ్ లో ఈనెల 8న భారీ స్థాయిలో విడుదలవుతుంది. ఖాకి ఫేమ్ వినోత్ డైరెక్షన్ లో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఒరిజినల్ వెర్షన్ లో అమితాబ్ పోషించిన పాత్రలో అజిత్ నటించగా తాప్సి పాత్రలో కన్నడ బ్యూటీ శ్రద్ద శ్రీనాథ్ నటించింది. జీ స్టూడియోస్ తో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈచిత్రాన్ని నిర్మించారు.
ఇక గత ఏడాది పొంగల్ కు విశ్వాసం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అజిత్ ఈ తాజా చిత్రం తో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. ఈసినిమా తరువాత అజిత్ తన 60 వ చిత్రాన్ని కూడా వినోత్ తోనే చేయనున్నాడు.