చిన్నప్పటి నుండే సినిమాల్లో నటిస్తూ తెలుగులో ఎన్నో సినిమాల్లొ నటించి, బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అతిలోక సుందరి శ్రీదేవి.  శ్రీదేవి హఠాన్మరణం ఆమె అభిమానులకి తీరని లోటు. అయితే ఆమె బోనీ కపూర్ ని పెళ్ళి చేసుకుని  బాలీవుడ్ లో సెటిల్ అయినా తనకి దక్షిణాది ఇండస్ట్రీ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ. అయితే ఆమెకి సౌత్ లో సినిమా నిర్మించాలనే కల ఉండేదట.


అయితే ఇప్పుడు ఆ కలని భర్త బోనీ కపూర్ నెరవేర్చాడట. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ అగ్ర నిర్మాత బోని కపూర్ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టి నేర్కొండ పార్వాయిని విజయవంతంగా పూర్తి చేశారు. బాలీవుడ్‌లో భారీ సక్సెస్ అందుకొన్న పింక్ చిత్రాన్ని రీమేక్‌ చేసి విడుదలకు రెడీ చేశారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ అజిత్ కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా తారియాంగ్ తదితరులు నటించారు.


ఈ చిత్రంలో విద్యాబాలన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి వినోద్ హెచ్ దర్శకత్వం వహించారు. నేర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ కుమార్ లాయర్‌ పాత్రలో నటించాడు. ఈ సినిమా ఆగస్టు 8 తేదీన రిలీజ్ కానున్నది.ఈ నేపథ్యంలో సినిమా ప్రీమియర్‌ను సింగపూర్‌లో ప్రదర్శించారు. దక్షిణాదిలో సినీ నిర్మాణం చేపట్టాలనే కోరిక శ్రీదేవికి ఉండేదనే విషయాన్ని చెప్పారు.


ఈ సందర్భంగా బోనీకపూర్ ట్విట్టర్‌లో స్పందించారు. సింగపూర్‌లో దిగ్విజయంగా నేర్కొండ పార్వాయి ప్రీమియర్ వేశాం. దీంతో నా భార్య శ్రీదేవి కపూర్ కలను పూర్తి చేయడానికి ప్రయత్నించాను. అజిత్ కుమార్, హెచ్ వినోద్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేది కాదు. శ్రీదేవి కల నెరవేరేది కాదు. అందుకు సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: