టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథ సినిమాలను చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో డైరెక్టర్ తేజ ని హీరో గా చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్త పెద్ద షాకింగ్ విషయం ఏమీ కాదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు హీరోగా మారిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో దాసరి నారాయణరావు, భీమినేని శ్రీనివాసరావు, దేవి ప్రసాద్, మరియు కాశీ విశ్వనాథ్ లాంటి వాళ్లు నటుడిగా మారి తన సత్తా ఏమిటో వెండితెరపై చూపించారు. అయితే ప్రస్తుత రోజుల్లో వి.వి.వినాయక్ అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా హీరోగా నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో డైరెక్టర్ తేజ హీరో గా మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం దిల్ రాజు ఇటీవల ఒక కథ విన్నాడట. అయితే ఆ కథ ఏమిటంటే రియల్ లైఫ్ కరెక్ట్ అని ఆ సినిమాలో తేజ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు వెంటనే ఆ స్క్రిప్టు మొత్తం డైరెక్టర్ తేజ కి వినిపించారట. దీంతో వెంటనే డైరెక్టర్ తేజ స్క్రిప్ట్ చాలా బాగుందని మొత్తం ఫైనలైజ్ చేయగా కచ్చితంగా సినిమా చేస్తానని క్యారెక్టర్ కూడా ఇంట్రెస్ట్ గా ఉందని దిల్ రాజు కి చెప్పాడట తేజ. మరి స్క్రిప్టు మొత్తం విన్నాక డైరెక్టర్ తేజ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


డైరెక్టర్ తేజ గతంలో చిత్రం సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టి ఉదయ్ కిరణ్ హీరోగా వెండితెరకు పరిచయం చేసి అతనితో సూపర్ డూపర్ హిట్టు అందుకున్నాడు. అంతేకాకుండా ఆ తర్వాత నితిన్ ని కూడా జయం సినిమాతో హీరోగా పరిచయం చేసి అతనికి మంచి లైఫ్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు వచ్చినా డైరెక్టర్ తేజ...ఎక్కడా కూడా నిరాశ పడకుండా సినిమాలు చేస్తూ ఇటీవల రానా తో నేనే రాజు నేనే మంత్రి సినిమా చూసి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఇటువంటి తరుణంలో డైరెక్టర్ తేజ సినిమాలో నటిస్తున్నాడు అన్న వార్త రాగానే సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆయన నటిస్తే చాలా బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: