ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ 3 రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారం రన్ అవుతుంది.  అయితే ఈ రెండు వారాల్లో బిగ్ బాస్ లో ఎన్నో గిల్లి కజ్జాలు, అలకలు, గొడవలు నడుస్తూ వస్తున్నాయి.  గత సీజన్ లో బిగ్ బాస్ కన్నా ఈ సీజన్ బిగ్ బాస్ లో కాస్త వెరైటీగా ఉంటుందని ట్రాన్స్ జెండర్  తమన్నా సింహాద్రి ని తీసుకున్నారు.  మొదటి వారం నటి హేమా ఎలిమినేషన్ కాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తమన్నా సింహాద్రి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టింది. 

మొదట బిగ్ బాస్ ఇంటి సభ్యుల మనసు గెలుచుకుంటా అని హూస్ట్ నాగార్జునతో ఎంతో వినయంగా అనడం చూసి వీక్షకులు తమన్నా ఎలా నెగ్గుతుంతో అనుకున్నారు..కానీ ఇప్పుడు తమన్నా చేస్తున్న రచ్చకు ఇంటి సభ్యులు ఎలా తట్టుకుంటారో అన్న పరిస్థితి నెలకొంది.  బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టిన రెండో రోజు నుంచి తమన్నా విశ్వరూపం చూపిస్తుంది.

సోమవారం నాడు ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు బిగ్ బాస్. ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఎక్కువగా ఇంటి సభ్యులు తమన్నాను నామినేట్ చేశారు.  ఇందులో భాగంగా రవికృష్ణ తన రీజన్స్ చెప్పి ట్రాన్స్ జెండర్ తమన్నాని నామినేట్ చేశాడు.  అంతే.. అప్పటినుండి తమన్నా.. రవిని టార్గెట్ చేస్తూ అతడికి నరకం చూపిస్తుంది. పప్పూ పప్పూ అంటూ అతని వెంట తిరుగుతూ అందరి ముందు ఘోరంగా అవమానించడం మొదలు పెట్టింది.  అయితే రవికృష్ణ మాత్రం చాలా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

అయితే రవికృష్ణ అలా టార్గెట్ చేయడం మంచిది కాదని..అతన్ని తిట్టడం చాలా దారుణమని  ఇంట్లో సభ్యులు ఆమెని  ఎంతగా మందలిస్తున్నా.. తమన్నా మాత్రం ఈ విషయంలో అసలు తగ్గడం లేదు. ఈ ఇష్యూ మీద బిగ్ బాస్ రవికృష్ణ, శ్రీముఖిలతో మాట్లాడాడు. వాస్తవానికి బిగ్ బాస్ తో కొత్త ట్రెండ్ పలుకుదామని బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంటూ తమన్నా చేస్తున్న చీఫ్ పనుల వల్ల అది రివర్స్ అయ్యేలా ఉందని భావిస్తున్నారు.

సోషల్ మీడియాలో వస్తోన్న రెస్పాన్స్ ని బట్టి తమన్నాని మద్యలోనే ఎలిమినేట్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వీక్ ఎండ్ లో నాగార్జున్ వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం బిగ్ బాస్ లో దొంగా పోలీస్ టాస్క్ నడుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: