ప్రభాస్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా సాహో. బాహుబలి వంటి ప్రపంచ స్థాయిలో హిట్టు కొట్టిన ప్రభాస్ ఆ తర్వాత చేస్తున్న సినిమా సాహో పై భారతీయ సినిమా ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ప్రభాస్ స్నేహితులు నిర్మాతలు ఆయన యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కనీవినీ ఎరుగని రీతిలో చేయబోతున్నట్లు ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం ఎవ్వరు ఊహించని విధంగా భారీ ఎత్తున చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ముఖ్యంగా తెలుగులో తన అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఈనెల పదవ తారీఖున మొట్టమొదటిసారిగా తెలుగులో ట్రైలర్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రభాస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తొందరగా పూర్తి చేసి వీలైనంత తొందరగా సినిమా అనుకున్న డేట్ కి అనగా ఆగస్టు 30వ తారీఖున విడుదల చేయాలని భావిస్తున్నారు సినిమా యూనిట్.


ఇదిలా ఉండగా భారీ ఎత్తున హైదరాబాద్ నగరంలో రామోజీ ఫిలిం సిటీలో కుదరకపోతే ఎల్బీ స్టేడియంలో సినిమాకి సంబంధించి ఒక భారీ కార్యక్రమానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో బాహుబలి సినిమా వేడుకలు రామోజీ ఫిలిం సిటీ లో చేసిన నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కూడా రామోజీ ఫిలిం సిటీ లోనే చేయటానికి సినిమా యూనిట్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధాకపూర్ నటిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: