నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో   యువ హీరో నిఖిల్ హీరోగా  లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా   రాబోతున్న చిత్రం 'అర్జున్ సురవరం'.  ఆయితే  నిఖిల్ కి  ఈ మధ్య అసలు టైం కలిసిరావడం లేదు. ఒక పక్క తోటి హీరోలు వరుస సక్సెస్ లతో ఊపు మీద ఉంటే.. నిఖిల్ మాత్రం చేసిన సినిమాని కూడా రిలీజ్ చేసుకోలేక బాక్సాఫీస్ వద్ద  వెనుకబడిపోతున్నాడు.  గత సంవత్సరమే రిలీజ్ అవ్వాల్సిన 'అర్జున్ సురవరం' విడుదల  పై ఇంకా క్లారిటీ రాలేదు.   మొదట్లో 'ముద్ర' అనే టైటిల్ పెట్టగా వేరే సినిమాతో వివాదమై దాన్ని 'అర్జున్ సురవరం'గా మార్చారు.  ఆ తర్వాత మే 1న సినిమా వస్తుందనుకుంటే అది వాయిదాపడింది.  ఆ తరవాత కూడా పలుసార్లు తేదీని మార్చారు.   కానీ ఇప్పటికీ ఆ సినిమా కష్టాలు తొలగినట్టు కనిపించట్లేదు. మొత్తానికి 'అర్జున్ సురవరం' రిలీజ్  సాహో తరువాతే  ఉంటుందని హీరోతో పాటు  చిత్రబృందం కూడా చెబుతున్నా..  విడుదల ఇంకా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 


 ఏమైనా మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే  నిఖిల్ సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఆశ్చర్యకరమే. నిజానికి నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి. కానీ ఒక్క హిట్ కూడా లేని హీరో సినిమాల లాగా  నిఖిల్ సినిమాలు తయారవుతున్నాయి.  టాలీవుడ్ లో ఇప్పుడంతా యంగ్ హీరోలదే హవా. కానీ ఆ హవాలో హడావుడి చెయ్యాల్సిన నిఖిల్.. అసలు ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోతున్నాడు.  ప్రస్తుతం నిఖిల్  దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ - 2 ' సినిమాను   చేయడానికి ప్రస్తుతం నిఖిల్ ప్లాన్ చేస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది. స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట.  పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  మరి నిఖిల్ కి  'కార్తికేయ 2' నైనా కలిసి వస్తోందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: