టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం క్యాస్టింగ్ కౌచ్ విషయమై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన గావించిన నటి శ్రీరెడ్డి, అక్కడినుండి తెలుగు ప్రజల దృష్టిలో పడింది. అయితే తరువాత ఆమె పై తెలుగు ప్రేక్షకులు కూడా ఫోకస్ చేయడం మొదలెట్టారు. ఆపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఆడవాళ్లకు కూడా ప్రత్యేకంగా కమిటీలు ఉండాలని, అలానే సినిమాల్లో మహిళల ఎంపిక కోసం ఎటువంటి వేధింపులు ఉండకూడదని కోరడం, దానికి మా అసోసియేషన్ సమ్మతించడం జరిగింది. ఇక ఆమె విషయంలో అంతా బాగుంది అనుకున్న సమయంలో, శ్రీ రెడ్డి సడన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలానే కొరటాల శివ, కోన వెంకట్, 

దగ్గుబాటి అభిరాం, నాని వంటివారిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంతో ఆమె ప్రజల నుండి కొంత నెగటివిటీ సంపాదించారు. ఇక కొద్దిరోజుల క్రితం చెన్నైకి తన మకాంని మార్చిన శ్రీరెడ్డి, ఎప్పటికపుడు తాజా సినిమా, రాజకీయ అంశాలపై ఫోకస్ చేస్తూ, తనదైన శైలిలో తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల మరొక్కసారి పవన్ ను టార్గెట్ చేస్తూ పలు విధాలుగా విమర్శలు చేసిన శ్రీరెడ్డి, తాజాగా కింగ్ నాగార్జున పై పడింది. నేడు ఆయన మన్మధుడు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆమె వ్యంగ్యంగా ఒక పోస్ట్ చేసింది. సామ్ వదిన నాగార్జున బాబాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది, దానితో ఆయన స్కిన్ కాస్త బాగుపడింది, అయితే ఆ అందంతో ఆయన పలువురు హీరోయిన్స్ మూతులు నాకుతున్నారు అంటూ నాగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. 

అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలను మాత్రం నాగ్ ఫ్యాన్స్ పూర్తిగా తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికల్లో ఆమెపై విరుచుకుపడుతన్నారు. నాగార్జున గారి గ్లామర్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, అయన మొదటి నుండి తన ఫిజిక్ ని ఎంతో అందంగా తీర్చి దిద్దుతున్నారని, అటువంటి వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదని వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఉన్నట్లుండి శ్రీరెడ్డి సడన్ గా నాగ్ ని ఎందుకు టార్గెట్ చేసింది అనేది మాత్రం ఎవరికీ కూడా అంతుపట్టడం లేదు. మరి దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: