ఇప్పటికే మీకు విషయం అర్ధం అయి ఉండాలి. పూరి జగన్నాథ్ కొన్ని గంటల ముందు వదిలిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ తో అతను చేయడం ఒక క్రేజీ ప్రాజెక్ట్ అని అటు పూరి అభిమానులు, దేవరకొండ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. కొన్ని వారాల ముందు పూరి ఈ ప్రకటన చేసి ఉంటే రెస్పాన్స్ వేరే లాగా ఉండేది ఏమో కానీ ఇప్పుడు మాత్రం 'ఇస్మార్ట్ శంకర్' పూరి మీదున్న నెగటివిటి అంతా చేరిపేసింది.
అయితే వీరిరువురి కలయిక లో వస్తున్న చిత్రం కథపై ఇప్పటికే ఊహాగానాలు ఇప్పటికే మొదలయ్యాయి.

అందులో మెయిన్ గా అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం పూరి మహేష్ కోసం సిద్ధం చేసిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమణ' ఇప్పుడు విజయ్ తో తీస్తున్నట్లు సమాచారం. కొంతమంది అయితే ఇదే అసలు నిజమని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇటీవలే పూరి మహేష్ ను ఉద్దేశించి తను కేవలం ఫార్మ్ ఉన్న హిట్ డైరెక్టర్ తోనే చేస్తాడని మాట్లాడడం తెలిసిందే. అయితే ఆ తర్వాత పూరి చిత్రం ఘన విజయం సాధించినా మహేష్ ఒక్క కూడా వేయకపోవడం కూడా ఆయన కూడా ఈ విషయం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 


పూరి, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది మరియు ఇతర తారాగణం గురించి కొద్ది రోజుల్లో వెల్లడిస్తానని పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. మొత్తానికి అందరి ఊహాగానాలు నిజమైతే పూరి ఎట్టకేలకు తన పట్టాలెక్కించినట్లే. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాథ్ హీరోగా మారాడు అంటేనే ఒక రకమైన కిక్ వస్తుంది కదూ.


మరింత సమాచారం తెలుసుకోండి: