శ్రీ రెడ్డి.. వివాదస్పద వ్యాఖ్యలకు పర్యాయపదంగా పేరు మోసిన నటి. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఫామ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి గతంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ చెందిన ప్రముఖుల పై సంచలన మరియు అతి దారుణమైనఆరోపణలు చేసి.. మొత్తానికి చాల వివాదాలనే సృష్టించింది. వారిలో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ వరకూ ఉన్నారు. ఏమైనా శ్రీ రెడ్డి ఆరోపణల లిస్ట్ లో చాలా మంది ప్రముఖులు ఉండటంతో అప్పట్లో వీటి పై పెద్ద దుమారం లేచింది. అయితే గత కొన్ని రోజులుగా శ్రీ రెడ్డి సైలెంట్ గా ఉండడంతో ఇక ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు ఉండవని.. సినిమా వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. కానీ విచిత్రంగా శ్రీ రెడ్డి విమర్శలు మానేసి పొగడ్తలను అందుకుంది. తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ స్టార్ హీరో పై కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది. విషయంలోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని శ్రీరెడ్డిని తెగ పొగిడేస్తూ, ఆకాశానికి ఎత్తేసింది. ప్రభాస్ వ్యక్తిత్వం చాలా బాగుంటుందని, తాను ఎప్పుడు కూడా ప్రశాంతంగానే కనిపిస్తారని, ఇతరలతో చాలా పద్దతిగా వ్యవహరిస్తారని, అంతేకాకుండా తాను కూర్చోవడంలోనే ఓ రాజసాన్ని ప్రదర్శిస్తారని, అలాంటి డ్రీం బాయ్ ని అందరు కూడా చాలా ఇష్టపడతారని ఇలా శ్రీరెడ్డి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది.
అంతేకాకుండా ప్రభాస్ తాజాగా నటించిన సాహో చిత్రం చాలా పెద్ద సక్సెస్ ని సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని, శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టింది. పవన్ కళ్యాణ్, నాని లాంటి హీరోల మీద విరుచుకుపడిన శ్రీరెడ్డి, ఇపుడు ప్రభాస్ పై ఇంత సానుకూలంగా స్పందించడంతో.. మొత్తానికి శ్రీ రెడ్డిలో మార్పు వచ్చిందేమోనని అనుకుంటున్నారు శ్రీ రెడ్డి బాధితులు. అయితే ప్రభాస్ అభిమానుల నుండి సింపతీని రాబట్టుకోడానికే శ్రీరెడ్డి కొత్త నాటకానికి తెరలేపిందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం అగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది.