యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి2 ’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు.  బాహుబలి రెండు భాగాలుగా వచ్చిన విషయం తెలిసిందే.  ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ సమయంలో ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా సున్నితంగా తిరస్కరిస్తూ రాజమౌళికే తన డేట్స్ మొత్తం డెడికేట్ చేశారు. ఆ సినిమా టాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీశారు. అందుకే అవార్డులు, రికార్డులు ఒక్కటేమిటి జాతీయ స్థాయిలో టాలీవుడ్ రేంజ్ ని ఓ లెవెల్లో  పెంచింది. 

ఇందులో బాహుబలి గా ప్రభాస్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి.  అయితే బాహుబలి స్థాయిలో మరో సినిమాలో నటిస్తారా అంటే కష్టమని చెప్పారు ప్రభాస్.  ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమా బాహబలి రేంజ్ దాటుతుందని ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు.  తాజాగా ఈ విషయంపై దర్శకులు సుజిత్ స్పందిస్తూ...చాలామంది 'సాహో' చిత్రాన్ని బాహుబలితో పోల్చుతున్నారని, అయితే ఈ రెండు చిత్రాలు దేనికవే విభిన్నమైనవని సుజిత్ స్పష్టం చేశాడు.  అయితే బాహుబలిని చూసిన ప్రేక్షకులు తన సినిమాను ఆ సినిమాతో పోల్చుకోవడం సంతోషమే..అయితే సాహూలో కూడా ఆ స్థాయి ఎక్కడా తగ్గించలేదని అన్నారు.

బాహుబలి స్థాయిలో 'సాహో' ఉంటుందని భావిస్తున్నవాళ్లను తన చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురిచేయదని పేర్కొన్నాడు. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ఆశిస్తున్నారో తాను గ్రహించగలనని వివరించాడు. రాజమౌళి అంత గాప్ప దర్శకులతో నన్ను పోల్చకండీ అంటూ సాదరంగా కోరుతున్నారు ఈ యంగ్ డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'సాహో' ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: