టాలీవుడ్‌లో 2012లో వ‌చ్చిన `శివ మనసులో శృతి` సినిమాతో రెజీనా క‌సాండ్రా కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత అందం, అభిన‌యం అన్నీ ఉన్నా కూడా ప్ర‌స్తుతం ఈమె కెరీర్ పూర్తిగా డైల‌మాలో ఉంది. రెజీనా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో కూడా న‌టించింది. ఇటు తెలుగులో ట్రెడిష‌న్ పాత్ర‌లో చేసినా క్రేజ్ మాత్రం తెచ్చుకోలేక‌పోయింది. ఒక్క సినిమా కూడా హిట్ కావ‌డం లేదు. పైగా వ‌ర‌స ఫ్లాపుల‌తో రెజీనా కెరీర్ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. 


అలాగే ఎప్ప‌టిక‌ప్పుడు అందాల‌తో ఆర‌బోసే రెజీనాకు ఒక్క సారి కూడా టాప్ హీరోల చెంత న‌టించే ఛాన్స్ రాలేదు. త‌న కెరీర్‌లో టాప్ హీరోతో చేసిన సినిమా ఏద‌న్నా ఉంది అంటే.. అది ఒక్క‌ ర‌వితేజ `ప‌వ‌ర్‌` సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించి. కేవ‌లం మీడియం హీరోలు త‌ప్ప పెద్ద హీరోల‌తో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకోలేక‌పోయింది. ఇక తాజాగా అడవి శేష్ `ఎవ‌రు` చిత్రంలో  హీరోయిన్ గా అత్యాచారానికి గురయ్యే అమ్మాయిగా నటించింది రెజీనా క‌సాండ్రా. ఈ చిత్రం ఆగ‌ష్టు 15న గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.


అయితే ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లతో ఎవరు చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. రేప్ కేసుపై మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన ఎవరు చిత్రాన్ని రాంజీ దర్శకత్వం వహించాడు. వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న రెజీనాకు కొన్ని రోజులుగా అవ‌కాశాలు రావ‌డ‌మే త‌గ్గిపోయాయి. దీంతో ఈమె హాట్ హాట్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు కూడా సై అంటున్నా ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు. చివ‌ర‌కు ఈ అడ‌వి శేష్ స‌ర‌స‌న న‌టించేందుకు ఛాన్స్ దొరికింది. 


నిజానికి ఈ సినిమా హిట్ ఈమెకు చాలా అవ‌స‌రం. ఇప్ప‌టికే వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న రెజీనాకు ఒక‌వేళ‌ ఈ సినిమా కూడా హిట్ అవ్వ‌క‌పోతే  అస‌లు రెజీనా ఇండ‌స్ట్రీలో ఉంటుందా? లేదా గుడ్ బై చెప్పేస్తుందా ? అనే చ‌ర్చ‌లు కూడా కొన‌సాగుతున్నాయి. మ‌రి రెజీనా ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుంది ఆగ‌ష్టు 15న వ‌ర‌కు వెయిట్ చేయాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: