మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. 250 కోట్ల పైగా బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా మేకింగ్ వీడియో కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు.  


వరల్డ్ ఆఫ్ సైరా అంటూ సైరా నరసింహా రెడ్డి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. విజువల్ గ్రాండియర్ గా వస్తున్న ఈ సినిమా మేకింగ్ వీడియోతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. నరసింహా రెడ్డి పాత్రలో చిరు ప్రాణం పెట్టి చేశారని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, రవి కిషన్ ఇలా అందరి పాత్రలను పరిచయం చేశాడు. 


సినిమాలో వార్ సీన్స్ బాగా ఉన్నట్టు తెలుస్తుంది. మేకింగ్ వీడియో చూసే సినిమా సూపర్ హిట్ పక్కా అనేస్తున్నారు ఆడియెన్స్. కచ్చితంగా బాహుబలిని మించేలా సైరా నరసింహా రెడ్డి ఉంటుందని అంటున్నారు. సురేందర్ రెడ్డి రెండేళ్లు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మేకింగ్ వీడియోతోనే అంచనాలు పెంచిన సైరా టీజర్, ట్రైలర్ తో సినిమా రేంజ్ ఏంటో చూపిస్తుందని చెప్పొచ్చు.  


ఖైది నంబర్ 150 సినిమతో సెన్సేషనల్ హిట్ అందుకున్న చిరంజీవి సైరాతో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు. బాహుబలి వచ్చిన తర్వాత తెలుగులో ఇలాంటి సినిమాలకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమా బాహుబలి రికార్డులను సైతం తిరగరాసేలా ఉందని అంటున్నారు. ఇక సైరా టీజర్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగష్టు 20న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: